సుధాకర్ రెడ్డి హత్యకేసులో కొత్త ట్విస్ట్…

227
Evadu re-run in crime of passion
- Advertisement -

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చిన స్వాతి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్య కేసులో నిందితుడిని మటన్ సూప్ పట్టించింది. ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ వంద శాతం నిజం. సుధాకర్ రెడ్డి భార్య స్వాతి తన భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని.. ప్రియుడు రాజేశ్ తో కలిసి భర్తను హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రియుడిపై యాసిడ్ దాడి చేసి.. రాజేశ్ ను తన భర్తగా నమ్మించే ప్రయత్నంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయింది.

మృతుడు సుధాకర్‌ రెడ్డి‌కి నాన్‌ వెజ్‌ అంటే చాలా ఇష్టం. అయితే ముఖంపై పెట్రోలు పోసుకుని సుధాకర్ పేరుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌ మాత్రం పూర్తి శాకాహారి. అయితే కాలిన గాయాలతో ఉన్నవారికి మటన్ సూప్ అందిస్తే త్వరగా నయమవుతుందని సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజేశ్‌కు అందజేస్తే, దానిని తాగేందుకు అతడు నిరాకరించాడు.  తమ అనుమానాలతోపాటు మటన్ సూప్ కూడా తోడువడంతో.. గాయాలతో చికిత్స పొందుతున్నది సుధాకర్ కాదని కుటుంబ సభ్యులు నిర్థరించుకున్నారు. దీంతో నాగర్ కర్నూలు పోలీసులకు వారు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Evadu re-run in crime of passion
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి, స్వాతిలు ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసిన సుధాకర్‌ మూడేళ్ల కిందట నాగర్ కర్నూల్‌కు వచ్చి స్థిరపడ్డారు. రెండేళ్ల నుంచి నాగర్‌ కర్నూల్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ రాజేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీని గురించి ఇటీవల సుధాకర్ రెడ్డికి తెలియడంతో అతడిని హత్యచేయాలని పథకం వేసింది. ఇద్దరూ కలిసి సుధాకర్ రెడ్డిని హత్యచేసి కొత్త నాటకానికి తెరతీశారు.

- Advertisement -