గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన ఈవీ ఓనర్స్

23
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా నానక్ రాం గూడ టోల్ ప్లాజా వద్ద వంద మొక్కలు నాటారు ఈవీ ఓనర్స్ అసోషియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా ప్రశాంత్ మరియు ప్రఫుల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.

Also Read:ఏకాగ్రతను పెంచే అధునాతన “తులాసనం”!

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గ్రీనరీ పెంపొందించడంలో ఎంతో ముందుందని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడా చూసిన పచ్చదనం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.ఇంత మంచి కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు..ఈ కార్యక్రమం లో గోవింద్, శ్రీనివాస్, సంతోష్ అనూశ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Also Read:నిర్మల్‌కు సీఎం కేసీఆర్..

- Advertisement -