తెలంగాణ‌లో ఎక్క‌డా క‌రోనా వ్యాప్తి చెంద‌లేదు: ఈట‌ల‌

287
etela rajender
- Advertisement -

ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారికి మాత్ర‌మే క‌రోనా సోకింద‌ని తెలిపారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. మెడిక‌ల్ కాలేజీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అనంత‌రం మాట్లాడిన ఆయ‌న ప్ర‌భుత్వం ఇచ్చిన స‌ల‌హాలు,సూచ‌న‌లు పాటించాల‌న్నారు.

26 రోజుల్లో 47 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు ఈట‌ల‌.700 ఐసీయూలు 190 వెంటిలేట‌ర్లు సిద్ధంగా ఉన్నాయ‌ని చెప్పారు.తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి చెంద‌లేద‌ని తెలియ‌జేశారు.

క‌రోనా బాధితుల్లో ఏ ఒక్క‌రూ విష‌మంగా లేర‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్ర‌తి నిమిషం క‌రోనా ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నార‌ని చెప్పారు. క‌రోనా బాధితుల కోసం 10 వేల ప‌డ‌క‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని చెప్పారు.
తొలి ద‌శ‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, రెండో ద‌శ‌లో ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ఉప‌యోగించుకుంటామ‌ని తెలిపారు.

- Advertisement -