అభిమానులకు,ప్రజలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ వినూత్న పిలుపు…

145
errolla srinivas
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వైద్యమౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని నెహ్రూ నగర్ వాకర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు కొన్ని కోట్ల మొక్కలను నాటడం జరిగింది.తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కానీ గ్రీనరీతో రాష్ట్రం కళకళాడుతుంది.రాష్ట్రంలోని ప్రతోక్కరూ తమ పుట్టిన రోజుసందర్భంగా ఒక మొక్కను నాటాలి.ఇంకో ముగ్గురు నాటాలని పిలుపునివ్వాలని అభిమానులకు,ప్రజలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు..

- Advertisement -