కేసీఆర్ నాయకత్వంలో ఉజ్వలంగా తెలంగాణ..

253
errabelli
- Advertisement -

మ‌రో ఏడాది కాలంలో తెలంగాణ‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు రానుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. క‌రోనా కార‌ణంగా చైనాలోని ప‌రిశ్ర‌మ‌లు మ‌న తెలంగాణ‌కే రానున్నాయి. ఇంద‌కు సిఎం కెసిఆర్, ఐటీ శాఖా మంత్రి కెటిఆర్ ల కృషి ఎంతో ఉంది. ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను వ‌రంగ‌ల్ లోనే పెట్టాల‌నే సంక‌ల్పంతో కెసిఆర్, కెటిఆర్ లు ఉన్నారు. ఆ విధంగా వ‌రంగల్ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్క‌డ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌చ్చే మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, మ‌న‌కే కాదు, మరో ఏడాది పాటు క‌రోనా వైర‌స్ క‌ష్టాలు ప్ర‌పంచం మొత్తానికి ఉండ‌నున్నాయి. ఈ లోగా చైనా ప‌రిశ్ర‌మ‌లు ఇండియాకే రావాల‌ని నిర్ణ‌యించాయి. ప్ర‌ధాని మోడీని ఆ పారిశ్రామిక‌వేత్త‌లు సంప్ర‌దించి, త‌మ ప‌రిశ్ర‌మ‌ల‌ను తెలంగాణ‌లోనే పెడ‌తామ‌ని చెప్పాయ‌ని, ఇష్టం లేకున్నా, మోడీ ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను తెలంగాణ‌కు రావ‌డానికి అంగీక‌రించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు. ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రానికి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌స్తున్న‌ది. మంచినీటి వ‌స‌తి ఉంది. దేవాదుల‌, ఎస్సారెస్పీ, కాళేశ్వ‌రం నీరు అందుతున్న‌ది. ఇటు రైతాంగం బాగుప‌డుతున్న‌ది. ఇక ప‌రిశ్ర‌మలు కూడా వ‌స్తే, చ‌దువుకున్న వాళ్ళ‌కు ఉద్యోగాలు, ఉపాధి కూడా ల‌భిస్తాయ‌ని మంత్రి చెప్పారు.

క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ‌, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి లాక్ డౌన్ ఉంటుంద‌ని, లాక్ డౌన్ ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించి, మ‌న‌మంతా ఆరోగ్యంగా ఉండాల‌న్నారు. అంతేగాక‌, ఈ స‌మ‌యంలో నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌ని, దాతలు, నేత‌లు ముందుకు రావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

స్థానికంగా అశోక్ రెడ్డి, శ్రీ‌నివాస్ త‌దిత‌రుల స‌హ‌కారంతో అంద‌చేసిన నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నిరుపేద‌ల‌కు పంపిణీ చేశారు.

- Advertisement -