అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాడుతాం: ఎర్రబెల్లి

90
errabelli
- Advertisement -

అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు పోరాడుతామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంజీఎంలో రాకేశ్‌ మృతదేహానికి నివాళులు అర్పించిన ఎర్రబెల్లి….అగ్నిపథ్‌ ఆందోళనల్లో రాకేశ్‌ మృతిచెందడం బాధాకరమన్నారు. సైన్యంలో ఔట్‌సోర్సింగ్‌ విధానం తీసుకురావడం దారుణమని విమర్శించారు. సైనికులను చంపి భావోద్వేగాలతో గెలవాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. అగ్నిపథ్‌ విధానం తీసుకొచ్చి దేశరక్షణతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ రైతులకు క్షమాపణలు చెప్పినట్లే యవతకూ చెప్పాలన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలతో రైతులకు తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడితే తరిమికొడుతామని హెచ్చరించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాడుతామని చెప్పారు.

- Advertisement -