మాస్కులు పంపిణీచేసిన మంత్రి ఎర్రబెల్లి..

184
- Advertisement -

జనగామ జిల్లా కోడకండ్ల మండలంలో మాస్కులు పంపిణీ చేశారు. లక్ష్మక్కపల్లి గ్రామం నుండి కోడకండ్ల మండల కేంద్రానికి బయలుదేరిన ఎర్రబెల్లి…మార్గం మధ్యలో పెద్దబాయి తండా వద్ద వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలను చూసి ఆగి మాస్క్ లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడురు, అమ్మపురం గ్రామలాలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

- Advertisement -