పాలమూరులో మంత్రి ఎర్రబెల్లి పర్యటన…

606
errabelli dayakarrao
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో గ్రామ సభకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ రేవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్, జెడ్పీ చైర్ పర్సన్ సర్ణ, ఎంపిపి బలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపిటిసీలు కల్పన, సత్తమ్మ , వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అంతకముందు మూసాయిపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో గ్రామ సభకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్, జెడ్పీ సర్ణ, ఎంపిపి కళావతి, జెడ్పీటీసీ ఇంద్రసాగర్, ఎంపిటిసి సుకన్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -