పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల సంఘం డైరీ ఆవిష్క‌రణ..

228
- Advertisement -

తెలంగాణ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల సంఘం డైరీని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూనియ‌ర్ పంచాయ‌తీ అధికారుల‌కు వేత‌నాల‌ను పంచాయ‌తీ అధికారులతో స‌మానంగా ఇస్తున్నార‌ని, ఇంకా ప్ర‌భుత్వానికి మంచిపేరు తెచ్చే విధంగా ప‌ని చేయాల‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల స‌మ‌స్య‌ల‌ను మంత్రి దృష్టికి తెచ్చారు. వాటి ప‌ట్ల ప్ర‌భుత్వానికి నివేదించి త‌గు విధంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి వారికి తెలిపారు. మంత్రిని క‌లిసిన వారిలో ఆ సంఘం అధ్య‌క్షుడు మధుసూధన్ రెడ్డి, పంచాయితీరాజ్ సర్వీస్ అధ్యక్షులు కె.రాఘవేందర్ రావు, ఎంపీడీఓల‌ సంఘ అధ్య‌క్షుడు సత్తయ్య, మినిస్టీరియల్ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -