ప్రగతి భవన్‌లో మొక్కలు నాటిన ఎరిక్‌ సోలిమ్‌

85
- Advertisement -

ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్‌ సోలిమ్‌ హైదరాబాద్ ప్రగతి భవన్లో మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రగతి భవన్‌లో మొక్కలు నాటినందుకు అభినందనలు తెలిపారు ఎంపీ సంతోష్. పర్యావరణ పరిరక్షణకు మీరు చూపుతున్న చొరవ మాలో కూడా స్పూర్తి నింపిందని చెప్పారు. గ్రీన్‌ ఛాలెంజ్ విజయవంతానికి మీరిచ్చిన సలహాలు ఎంతో విలువైనవని…ఇవి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడ్డాయన్నారు.

Also Read:‘డెవిల్’ వార్…దర్శక-నిర్మాతల మధ్యలో!

మీతో కలిసి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, అందరం కలిసి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. అందరం కలిసి పచ్చదనాన్‌ని భవిష్యత్ తరాలకు అందిద్దమన్నారు. ఇదే విధంగా భవిష్యత్‌లో కూడా మీ మద్దతుతో వినూత్నంగా గ్రీన్ ఛాలెంజ్‌ని ముందుకు తీసుకెళ్దామన్నారు.

- Advertisement -