ప్రవీణ్ కుమార్‌కు మద్దతు ప్రకటించిన షర్మిల..!

478
sharmila
- Advertisement -

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్వేరోపై బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై సబ్బండ వర్గాలు మండిపడుతుండగా ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా ర్యాలీలు,ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పార్టీ నేత ఏపూరి సోమన్న కీలక ప్రకటన చేశారు. ప్రవీణ్ కుమార్ కు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని… ఇది షర్మిల తీసుకున్న నిర్ణయంగా ప్రవీణ్ కుమార్ కే మా మద్దతు అని ప్రకటించారు. స్వెరో సంస్థతో పేద పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తున్నారని ఆయన మీద జరుగుతున్న దాడులను సహించేది లేదని హెచ్చరించారు.

ప్రవీణ్ కుమార్ గురుకులాలలోనే కొనసాగాలని … హిందూ దేవతలను కించ పరచాల్సిన అవసరం తమకు లేదన్నారు. వందే మాతరం పడుతూనే.. స్వేరో గీతం పాడుతున్నారని …మతాన్ని, కులాన్ని కించపరచడం స్వెరో లక్ష్యం కాదని స్పష్టం చేశారు సోమన్న.

- Advertisement -