మానవాళి మనుగడకు మొక్కలే ఆధారం: పెద్దపల్లి డీసీపీ అఖిల్

61
akhil
- Advertisement -

ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతోంది. పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్‌ మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే నామినేట్‌ చేయగా దీంతో స్పందించి పెద్దపల్లి డీసీపీ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటి వాటితో సెల్ఫీ దిగారు.

మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని….ఈ సందర్భంగా మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైభవ్ గైక్వాడ్ అడిషన్ డీసీపీ వరంగల్, గౌష్ ఆలం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ములుగు మరియు భూపాలపల్లి, కిరణ్ కారే ఎస్డీపీవో బైంసాలను నామినేట్ చేస్తున్నట్లు ఇంచార్జ్ డీసీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -