టాస్ గెలిచి ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్..

310
England wins toss
- Advertisement -

ఇంగ్లండ్-ఇండియాల తొలి వన్డే ప్రారంభమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టీమిండియా జట్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మకు తొలి రెండు మ్యాచులకు విశ్రాంతిని కల్పించారు.

ఇరు తుది జట్ల వివరాలు ఇవే.
ఇండియా: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్.

ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కీపర్), మలాన్, బెయిర్ స్టో, మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, రషీద్, మార్క్ వుడ్.

కాగా, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్‌కు ఇంగ్లండ్ బౌల‌ర్లు షాకిచ్చారు. 5 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు తీసి భార‌త్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (0)ను డ‌కౌట్ చేయ‌డంతో పాటు…ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్ (4), కేఎల్ రాహుల్ (1)ల‌ను త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ పంపారు. ఆదిల్ ర‌షీద్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌, మార్క్ వుడ్ త‌లా ఓ వికెట్ తీశారు.

- Advertisement -