మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం..

112
- Advertisement -

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని తాజాగా ఈడీ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే పలువురు సినీ నటులను విచారించిన ఈడీ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను సైతం పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తమకు అందించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోరింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితులు, సాక్షుల వాంగ్మూలానికి సంబంధించిన రికార్డులు అందజేయాలని లేఖలో కోరింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవంటూ ఎక్సైజ్ శాఖ తేల్చేసింది.

అయితే ఈడీ మాత్రం ఈ కేసు విచారణ ఇంకా తొలి దశలోనే ఉందని, విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సేకరించిన డిజిటల్ రికార్డులను తమకు ఇంత వరకు సమర్పించలేదని తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో ఈడీకి రికార్డులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు మరోసారి ఈడీ విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.

- Advertisement -