ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల..

170
- Advertisement -

నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. మొత్తంగా ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించారు.

అస్సాంలో పోలింగ్..
అస్సాంలో మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ జరగనుంది. మొదటి దశలో 47 స్థానాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల, మార్చి 27న పోలింగ్‌, రెండో దశలో 39 స్థానాలకు మార్చి 5న నోటిఫికేషన్‌ విడుదల. ఏప్రిల్‌ 1న పోలింగ్‌, మూడో దశలో 40 స్థానాలకు ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహణ. ఈ మూడు దశల పోలింగ్‌ను మే 2వ తేదీన కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

పుదుచ్చేరి,కేరళలో పోలింగ్‌..
కేరళలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌.. మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్‌ 6న రాష్ట్రంలోని మల్లాపురం లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహిస్తారు… పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 6న పోలింగ్ జరగనుంది‌. ఇక మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

పశ్చిమ బెంగాల్‌..
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్‌ నిర్వహణ. మొదటి దశ పోలింగ్‌ మార్చి 27న, రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 1న, మూడో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 6న, నాల్గొవ దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 10, ఐదో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 17, ఆరో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 22, ఏడో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 26, ఎనిమిదో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 29న జరగనుంది. ఈ ఎనిమిది దశల పోలింగ్‌ కౌంటింగ్‌ను మే 2న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నట్లు సీఈసీ తెలిపారు.

- Advertisement -