ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా..!

232
covid 19
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. రోజుకు వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమ‌ల కాలేజీలో చ‌దువుతున్న ఓ విద్యార్ధి ఇటీవ‌లే ఇంటికి రాగా ఆ విద్యార్ధి నుంచి మిగ‌తా కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా సోకింది.

ఇక నెల్లూరు పోలీసుశాఖలో కరోనా కలకలం రేపింది. నగరంలోని ఓ పోలీస్‌ స్టేషన్ లో 15 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజా కేసులతో జిల్లా పోలీస్‌శాఖలో మొత్తం 23కి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చేరింది.

ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 895121కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 884978 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7197 మంది మృతిచెందారు.

- Advertisement -