దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత..

279
ramalingaredy
- Advertisement -

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్నైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇటీవలె కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనకు ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశారు.

దుబ్బాక నుండి 2004,2008,2014,2018 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2001లో టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ వెన్నంటే నడిచారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. నిరంతరం ప్రజలతో కలిసి, ప్రజల్లో గడిపి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయ్యారు. రామలింగారెడ్డి కి భార్య కూతురు,కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపట్ల పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి.

- Advertisement -