నేటితో దుబ్బాక ప్రచారానికి తెర…

197
dubbaka
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుండగా 3న ఉప ఎన్నిక జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనుండా ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌ నుండి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ డి జోయెల్ డేవిస్ పేర్కొన్నారు.

ప్రచారం ముగియగానే స్థానికేతరులు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ -1861 అమల్లో ఉంటుందని వెల్లడించారు.

టీఆర్ఎస్ నుండి సోలిపేట సుజాత బరిలో ఉండగా బీజేపీ నుండి రఘునందన్ రావు,కాంగ్రెస్ నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.

- Advertisement -