సీఎం సహాయనిధికి‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌‌ భారీ విరాళం..

181
- Advertisement -

తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. అక్టోబరు నెలలో హైదరాబాద్‌ నగరంలో ఊహించని భారీ వర్షాలతో సతమతమైంది. ఈ ఆపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ లిమిటెడ్‌ తన వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ కార్పొరేట్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి. విశ్వనాథ్‌ తెలిపారు. ఈ మేరకు రూ. 5 కోట్ల విలువైన చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ కష్ట కాలంలో మీ నాయకత్వం, సమయానుకూల సహాయక చర్యలపట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -