మొక్కలు నాటిన డా. ప్రతిభా లక్ష్మీ…

99
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా వెస్ట్ మారేడుపల్లి లోని తమ నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు డా.ప్రతిభా లక్ష్మి.

ఈ సందర్భంగా డా.ప్రతిభా లక్ష్మి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మా వారు డా. మదన్ మోహన్ గాంధీ హాస్పిటల్ మరియు ఇద్దరు పిల్లలతో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.పర్యవరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆమె కోరారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఒక్కరు ఒక్కరు ఇలా మొక్కలు నాటుతూ పోతుంటే మన ప్రకృతిని మనం కాపాడినవాళ్లము అవుతామని అన్నారు అనంతరం డా.శ్రీదేవి ,డా స్రవంతి ,డా. త్రిలోక్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు డా. ప్రతిభా లక్ష్మి.

- Advertisement -