కులుమనాలిలో తెలుగు డాక్టర్ మృతి..

338
Dr Chandra Shekhar
- Advertisement -

కులుమనాలిలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. ఆయన యశోదా ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. గత బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి కులుమనాలికి విహార యాత్రకు వెళ్లాడు చంద్రశేఖర్ రెడ్డి. అక్కడ ప్యారాచూట్‌లో ప్రయాణిస్తుండగా వైర్లు తెగిపోవడంతో చంద్రశేఖర్‌ రెడ్డి కిందపడి మృతిచెందారు.

చంద్రశేఖర్‌ రెడ్డి సొంత ఊరు కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కొత్తపల్లె. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని నాగోల్‌లో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయన స్వగ్రామైన కొత్తపల్లె విషాదఛాయలు అలముకున్నాయి. చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

చంద్రశేఖర్ పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న తోటి వైద్యులు చంద్రశేఖర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -