ఆ వార్తలు అవాస్తవం: ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా

168
uppala srinivas
- Advertisement -

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ దేత్తడి హారిక నియామకంపై వివాదం అవుతోందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించారు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్త‌డి హారిక గారే ఉంటారు, దేత్త‌డి హారిక గారిని తొల‌గించార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదన్నారు.

హారికని తొల‌గించార‌ని చాన‌ళ్లలో వ‌స్తున్న వార్త‌లను ఆయ‌న ఖండించారు. తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీ‌నివాస్ గౌడ్ నాయ‌క‌త్వంలో ముందుకు వెళుతున్నామ‌న్నారు. ఈ విష‌యంలో మంత్రులు, ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించే ముందుకు వెళ్లామ‌ని అన్నారు.

- Advertisement -