సీఎంఆర్‌ఎఫ్‌కు ఎల్లారెడ్డి ప్రజాప్రతినిధులు విరాళం..

225
- Advertisement -

కరోనా వైరస్‌ కట్టడికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి మద్దతుగా మేమున్నామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సేవా సంస్థలు, సామాన్య ప్రజలు సైతం తమ వంతుగా సీఎం సహాయనిధికి విరాళం అందించి ఉదార స్వభావం చాటుకుంటున్నారు. తాజాగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసి లు సీఎం సహాయ నిధికి విరాళంగా రెండు లక్షల ఆరు వేల రూపాయల చెక్కులను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అందజేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆధ్వర్యంలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు మాజీ ఎంపీ కవితని కలిసి చెక్కులను అందజేశారు.

Donations For Telangana CM Relief Fund

ప్రస్తుత ఆపత్కాల‌ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీటీసిలను మాజీ ఎంపీ కవిత అభినందించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను నియంత్రించడానికి తోడ్పాటును అందించాలని మాజీ ఎంపీ కవిత కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని మాజీ ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, లాక్ డౌన్ ‌కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలు, వలస కూలీలకు వీలైనంత సహాయం చేయాలని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్, స్థానిక ప్రజాప్రతినిధులకు మాజీ ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.

- Advertisement -