ట్రంప్‌ ఫేస్‌ బుక్ ఈజ్‌ బ్యాక్‌..

17
- Advertisement -

రెండేళ్ల తర్వాత మళ్లీ ఫేస్‌ బుక్‌లో అడుగుపెట్టనున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఎత్తివేశాయి. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు. అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్‌ స్పాట్‌ వేదికగా వెల్లడించింది. ప్రజలు బ్యాలట్‌ బ్యాక్స్‌ ద్వారా తమ చాయిస్‌ను తెలపొచ్చని పేర్కొంది.

2021లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి అనంతరం దేశంలో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆయన మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈనేపథ్యంలో ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్టు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్ ప్రకటించాయి. అయితే గత నవంబర్‌లోనే ట్రంప్‌ ట్విట్టర్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -