పాకిస్తాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలను పరిష్కరించడం ఇష్టపడతాను అని తెలిపారు. కాబూల్పై దాడి చేసింది పాకిస్తానే అని పేర్కొన్నారు.
పాకిస్తాన్-ఆఫ్ఘానిస్తాన్ మధ్య వివాదాన్ని తాను పరిష్కరిస్తే, అది తాను పరిష్కరించిన తొమ్మిదో యుద్ధమవుతుందని ట్రంప్ అన్నారు. ఈ సమస్యను తాను సులభంగా పరిష్కరించగలనని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ముందుగా అమెరికాను నడపాల్సిన బాధ్యత తనదేనని అన్నారు. తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించినప్పటికీ 2025 నోబెల్ శాంతి బహుమతి తానిపొందలేదని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ దాడి చేసింది, లేదా ఆఫ్ఘానిస్తాన్పై దాడి జరుగుతోంది అని నాకు తెలుసు. దాన్ని నేను పరిష్కరించాలంటే అది నాకు సులభమే. కానీ అప్పటివరకు నాకు అమెరికాను నడపాలి అని ట్రంప్ అన్నారు. తనకు యుద్ధాలను పరిష్కరించడం ఇష్టం… ఎందుకంటే నేను ప్రజలు చనిపోకుండా ఆపడం ఇష్టం. నేను లక్షలాది మంది ప్రాణాలను రక్షించాను అని తెలిపారు.
పాకిస్తాన్ కాబూల్పై వైమానిక దాడులు జరిపి, తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న తరువాత, ఆఫ్ఘానిస్తాన్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ నిరంతరం ఆఫ్ఘానిస్తాన్ను TTP ఉగ్రవాదులను ఆశ్రయిస్తున్నదని ఆరోపిస్తుండగా, ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.
Also Read:T20 Worldcup:టోర్నిలో పాల్గొనే జట్లు ఇవే!

