బర్త్ డే రోజే విషాదం..కరోనాతో ఎమ్మెల్యే మృతి

244
dmk
- Advertisement -

తమిళనాడులో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఇప్పటికే వేలసంఖ్యలో కరోనా బారీన పడగా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.తాజాగా కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే అన్బగన్ మృతిచెందారు. పుట్టినరోజు నాడు ఆయన కరోనాతో మృత్యువాత పడటంతో స్ధానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.కరోనా వైరస్‌ వల్ల దేశంలో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.

కరోనాతో జూన్‌ 2న డాక్టర్‌ రీలా ఇన్స్‌టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చేరారు. ఇక ఇవాళ ఆయన 62వ పుట్టినరోజు జరుపుకోనుండగా రాత్రి ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమించింది. దీంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. అన్బగళన్ మృతిపట్ల తమిళనాడు సీఎం పళనిస్వామి, డీఎంకే చీఫ్ స్టాలిన్ సంతాపం వ్యక్తంచేశారు.

చెన్నైలోని చెపాక్‌ నియోజకవర్గం నుంచి 2001, 2011, 2016 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

- Advertisement -