మంత్రి జగదీష్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన : జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

59
suryapet
- Advertisement -

సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ జగదీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి, కేక్ కట్ చేసిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్. సూర్యాపేట మండలంలో సపావత్ తండా నుండి ఎండ్లపల్లి వరకు సుమారు రెండు వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -