మొక్కలు నాటిన సినిమా దర్శకుడు శశీ

291
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో అడవి శేషు (మేజర్ సినిమా) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఖాజాగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటిన దర్శకుడు శశీ (మేజర్ సినిమా).

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా మంచి ఛాలెంజ్ ను చేపట్టారని ప్రతి ఒక్కరం మొక్కలను పెంచి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా నా మిత్రులు శరత్ చంద్ర; అనురాగ్ మారెడ్డి లను మొక్కలు నాటిన ఛాలెంజ్ ‌ ఇచ్చాను అని తెలిపారు.

- Advertisement -