ప్రభాస్ మహేశ్ లతో రాజమౌళి మల్టీస్టారర్!

405
mahesh
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోయిలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్… కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. జనవరి 2021లో ఈసినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. కాగా రాజమౌళి తర్వాత చిత్రం ఎవరితో చేస్తాడన్నది టాలీవుడ్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం రాజమౌళి తర్వాతి మూవీ కూడా మల్టీస్టారర్ చేయనున్నాడని తెలుస్తుంది. ప్రభాస్, మహేశ్ బాబులతో రాజమౌళి సినిమా చేయనున్నాడని సినీ వర్గాల సమాచారం. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను కూడా సిద్దం చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది. మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి సినిమాలు పూర్తికాగానే రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.

- Advertisement -