డ్రగ్స్ కేసు: నిజం ఒప్పుకున్న పూరి..!

192
Director Puri for drugs case
- Advertisement -

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారుల ఎదుట ఇవాళ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరైన సంగతి తెలిసిందే.  ఉదయం 10 గంటలకు నాంపల్లి ఆబ్కారీ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పూరీ జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాశ్‌, సోదరుడు సాయిరామ్‌లతో కలిసి వచ్చారు. పూరీని సిట్‌ కార్యాలయంలోని ఐదో అంత‌స్తులో విచారిస్తున్నారు. అకున్‌ సబర్వాల్‌ పర్యవేక్షణలో నలుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నారు.

విచారణ సందర్భంగా  డ్రగ్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఏర్పడిన సంబంధాలు, డ్రగ్స్‌ అలవాటు, మద్యం తాగే అలవాటు, పూరీ జీవన శైలికి సంబంధించిన పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

అయితే కెల్విన్ తో సంబంధంపై మొదట బుకాయించిన పూరీ తరువాత ఓ మిత్రుడి ద్వారా కెల్విన్ తో పరిచయం ఏర్పడినట్లు చెప్పాడని సమాచారం. సినీ పరిశ్రమల్లో కొందరికి కెల్విన్ ను పరిచయం చేసినట్లు పూరీ ఒప్పుకున్నాడని తెలుస్తోంది.  అలాగే పూరీ తరచూ బ్యాంకాక్ వెళ్లే విషయమై అధికారులు ఆరా తీయగా… కేవలం సినిమా కథల కోసం తాను బ్యాంకాక్ వెళ్తుంటానని పూరీ చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేగాక పబ్ లకు వెళ్లే అలవాటు కూడా ఉందని పూరీ అంగీకరించాడు. బయటివాళ్ల కంటే సినిమావాళ్లలోనే తనకు ఎక్కువ మంది మిత్రులు ఉన్నట్లు పూరీ వెల్లడించాడు. ప్రస్తుతం పూరీపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. పూరీ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -