ప్రపంచకప్ ఆడాలనుంది…

254
dinsh karthik
- Advertisement -

కరోనా వైరస్ దెబ్బకు అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు,టోర్నీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఐపీఎల్ కూడా వాయిదా పడగా ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

ఇక వరల్డ్ కప్‌లో భారత్‌ తరపున తుదిజట్టులో చోటు సంపాదించడానికి ఆటగాళ్లు పోటీపడుతున్నారు. వీరిలో కీపర్ల జాబితాలో కేఎల్ రాహుల్,ధోని,రిషబ్ పంత్ ఉండగా తాజాగా దినేశ్ కార్తీక్ కూడా చేరిపోయాడు.

తనకు కూడా ఈ ఏడాది జరగబోయే ప్రపంచ కప్ లో ఆడలనుంది తెలిపాడు దినేష్‌. ఇటీవల తాను ఆడిన దేశీయ ఆటలలో కూడా బాగా ఆడాను. నన్ను అనుమానించడానికి నాకు ఎటువంటి కారణం లేదు అని కార్తీక్ చెప్పారు. టీ20ల్లో తన రికార్డు బాగా ఉందని అందుకే జట్టులో చోటుసంపాదించడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నానని వెల్లడించాడు. మరి సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

- Advertisement -