ఇక గుడ్‌బై అంటున్న డిగ్గీరాజా..!

192
digvijay singh sasy goodbye to ..
- Advertisement -

పదునైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడో సంచలన కామెంట్‌ చేశారు. ఇప్పుడిదే వార్త సోషల్‌ మీడియాలో తెగ తిరిగేస్తోంది. ఇంతకీ దిగ్విజయ్ చేసిని ఆ వార్తేంటి అనుకుంటున్నారా..?

ఆరు నెలల పాటు సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు పేర్కొన్నారు దిగ్వజయ్‌ సింగ్. తాను ఈ కాలంలో ఎలాంటి పోస్టులూ పెట్టననీ.. కేవలం సమాధానాలు మాత్రమే ఇస్తానని స్పష్టం చేశారు. నర్మదా యాత్ర పేరిట దిగ్విజయ్ సింగ్ మధ్య ప్రదేశ్‌లో మొత్తం 3,300 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శనివారం ద్వారాకా పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకుని ఆయన పాదయాత్రను ప్రారంభించారు.

 digvijay singh sasy goodbye to ..

ఈ యాత్ర కొనసాగే ఆరు నెలల కాలంలో తాను రాజకీయాలు మాట్లాడబోనని డిగ్గీ పేర్కొన్నారు. నదులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ చుట్టి వచ్చి వాటిలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు జాతీయ రాజకీయాల్లోనూ మంచి అనుభవం ఉంది.

అయితే ఇటీవల కాలంలో ఆయన ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో మళ్లీ రాజకీయాల్లో పుంజుకునేందుకు ఆయన నర్మదా యాత్ర చేపట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నర్మదా నది పొడవునా పాదయాత్ర చేస్తున్న దిగ్విజయ్… మొత్తం 110 అసెంబ్లీ స్థానాలతో పాటు గుజరాత్‌లోని 20 నియోజక వర్గాలను కూడా కవర్ చేయనున్నారు. కాగా కొద్ది నెలల్లో మధ్యప్రదేవ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందునే… రాజకీయ ప్రయోజనాల కోసం దిగ్విజయ్ సింగ్ ఈ యాత్ర చేపట్టారని బీజేపీ విమర్శిస్తోంది.

- Advertisement -