ధూం ధాం..ఫోర్త్ సింగిల్

7
- Advertisement -

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“ధూం ధాం” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’, ‘మాయా సుందరి..’, ‘టమాటో బుగ్గల పిల్ల..’ పాటలు పాట ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేసిన ‘కుందనాల బొమ్మ..’ పాటకు ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అందమైన సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీకృష్ణ పాడారు. ‘ అందమైన కుందనాల బొమ్మరా అన్నమయ్య కీర్తనల్లే ఉందిరా..పద్దతైన పారిజాత పువ్వురా.. నేనంటే ఇష్టమంటోందిరా..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

Also Read:గుండెపోటు ఎన్నిసార్లు రావొచ్చో తెలుసా?

- Advertisement -