ఎమ్.ఎస్. ధోని, సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు సుదీర్ఘకాలం పాటు విశేషమైన సేవలు అందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో సీఎస్కే ఆడిన చివరి హోమ్ మ్యాచ్ ముగిసిన తర్వాత, ఆటగాళ్లు మైదానంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మైదానం చుట్టూ తిరుగుతు అభిమానులకు అభివాదం తెలిపారు.
సన్రైజర్స్ హైదరాబాద్ పై విజయంతో చెపాక్ అభిమానులకు ఒక చిరస్మరణీయ ముగింపును ఇవ్వాలని సూపర్ కింగ్స్ భావించినప్పటికీ చెన్నై ఓటమి పాలైంది. సోమవారం నాటి మ్యాచ్లో ధోని ఉనికి అందరినీ ఆకర్షించింది. ఎందుకంటే చెపాక్ మైదానంలో అభిమానులు ఆయనను ఆటగాడిగా చూడటం బహుశా ఇదే చివరిసారి కావచ్చు. ఈ సీజన్లో ఇప్పటివరకు మ్యాచ్ రోజుల్లో స్టేడియాలకు దూరంగా ఉన్న ధోని, ఈ మ్యాచ్లో ఆడనప్పటికీ, మొదటిసారి మైదానానికి వచ్చారు.
ఈ సీజన్లో చెపాక్లో సీఎస్కేకి ఇదే చివరి మ్యాచ్ కావడంతో ధోని మరియు జట్టు సభ్యులు ల్యాప్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు. ఈ క్రమంలో ధోని మైదానంలో ఉన్న రైనాను కలిసి ఆలింగనం చేసుకున్నారు.
The special bond between #CSK and the home fans celebrated with a lap of honour 💛#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/yIHpoaIG4r
— IndianPremierLeague (@IPL) May 18, 2026
Also Read:IPL:ప్లేఆఫ్స్ రేస్..హోరాహోరీ!

