మొక్కలు నాటిన ధర్మపురి చిత్రయూనిట్..

40
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు ధర్మపురి చిత్ర యూనిట్ నటీనటులు గగన్ విహారి,అపర్ణ దేవి ,నిర్మాత భాస్కర్ యాదవ్.

ఈ సందర్భంగా నటీనటులు గగన్ విహారి,అపర్ణ దేవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.
సీఎం కేసీఆర్ హరితహారం,ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ వల్ల తెలంగాణ లో పచ్చదనం పెరిగిందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు…

- Advertisement -