మరదలికి అండగా ధనుష్‌..

261
Dhanush soundarya
- Advertisement -

కోలీవుడ్ లో విడాకుల పర్వం నడుస్తోంది. మొన్నటి మొన్న అమలాపాల్ వైవాహిక జీవితాన్ని తెగదింపులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీ కాంత్ కుమార్తే సౌందర్య కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో సౌందర్య వివాహం జరిగింది. వారిద్దరి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఈ జంట మధ్య ఇటీవల విభేదాలు తలెత్తినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరు విడివిడానే ఉన్నట్లు తెలుస్తోంది.

aishwarya_dhanush_rajinikanth

కాగా విడాకుల వ్యవహారంపై సౌందర్య కూడా స్పందించింది.గత ఏడాది కాలంగా తాను, అశ్విన్ విడివిడిగా ఉంటున్నామని, త్వరలో విడాకులు తీసుకుంటామని ఆమె తెలపింది. ఇదే సమయంలో ఇది తమ కుటుంబ వ్యవహారం మని, దీనిపై ఊహాగానాలు వద్దని సౌందర్య సూచించింది. తమ వ్యక్తిగత స్వేచ్ఛను భంగపర్చద్దని సౌందర్యలో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మరోవైపు తమ కుటుంబానికి అన్నివిధాల మద్దతుగా నిలిచినందుకు ధనుష్‑కు ఆమె థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం సౌందర్య ధనుష్ హీరోగా ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

- Advertisement -