గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న దండేపల్లి సీఐ..

387
Dhandepalli CI
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి ఆదరణ లభిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఒకరికి ఒకరు పోటీ పడుతూ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ దండేపల్లి సీఐ నారాయణ్ నాయక్, ఎస్ఐ విజయ్ కుమార్‌లు చేరో మూడు మొక్కలను నాటడమే కాకుండా మరో ఆరుగురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మేము భాగస్వాములం కావండం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కారణమైన జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి, ఏసీపీ లక్ష్మీ నారాయణకి ధన్యావాదాలు తెలుపుతున్నాం అన్నారు.

- Advertisement -