తెలంగాణకు కేంద్రబలగాలు..అవాస్తవం:డీజీపీ

269
Dgp Mahender Reddy
- Advertisement -

తెలంగాణకు కేంద్రబలగాలు వస్తున్నాయని రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజంలేదన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. కరోనా కట్టడి కోసం తాము కేంద్రం నుంచి ఎలాంటి సహాయాన్ని కోరలేదని ….పుకార్లను నమ్మవద్దన్నారు.

ఇక ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరింది. నిన్న ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఇండోనేషియా వారితో కలిసి కరీంనగర్ లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి గంగుల తెలిపారు.

- Advertisement -