అలెర్ట్‌గా ఉండండి:డీజీపీ అంజనీ కుమార్

42
- Advertisement -

రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వర్ష ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ అంజనీ కుమార్.ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుంచి ప్రజలు తగు సహాయ సహకారాలకు ఎదురుచూస్తారని అన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ తమ వంతుగా సేవలను అందించాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో తమ నాయకత్వ ప్రతిభను చూపించి ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు.

Also Read:ఆ హీరోలకి బేబీ నచ్చలేదు

జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్ధంగా పని చేయాలని సూచించారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని సూచించారు.
- Advertisement -