ఈ నెల 14న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సెలవు..

380
- Advertisement -

2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపులో వస్తున్న రిజిస్ట్రేషన్స్ వత్తిడిని దృష్టిలో ఉంచుకుని నాన్ అగ్రికల్చర్ (వ్యవసాయేతర ఆస్తులు) ట్రాన్స్ యాక్షన్స్ జరిగేందుకు 2021 మార్చి నెలలో అన్ని సెలవు రోజులు (మార్చి 7 ఆదివారం, మార్చి 13 రెండవ శనివారం, మార్చి 14 ఆదివారం, మార్చి 21 ఆదివారం & మార్చి 28 ఆదివారం)లలో కూడా రాష్టంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తాయని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగనున్నందున ఈ నెల 14 ఆదివారం హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయవని ప్రభుత్వం ఈ రోజు ఆదేశాలు జారీచేసింది. ఈ నెలలో ఇంకా మిగిలిన సెలవు రోజులు తేది 21-03-21, తేదీ 28-03-21 లలో ( 29 న హోళి మినహా ) నాన్ అగ్రికల్చర్ ట్రాన్స్ యాక్షన్స్ జరిపేందుకు అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తాయి.ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్స్ యాక్షన్స్ కు అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్‌తో తహసీల్దార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చునని ప్రభుత్వం వివరించింది.

- Advertisement -