కరోనా..ఢిల్లీలో జనసంచారంపై ఆంక్షలు

292
srivastava
- Advertisement -

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడవద్దన్నారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ. ఈ మేరకు ప్రజలకు ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే తప్ప ప్రజలకు ఇళ్లలోంచి బయటకు రాకుడదని సూచించారు.

వినోదం, కాలక్షేపం కోసం బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేయగా..ర్యాలీ, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణాల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని..మార్చి 31 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రజలకు తెలిపారు.

- Advertisement -