దీప్‌ సిద్దూపై రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు..

147
deep
- Advertisement -

రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లకు ప్రధానసూత్రధారిగా పంజాబీ నటుడు దీప్ సిద్దూ అని భావిస్తుండగా అప్పటినుండి పరారీలో ఉన్నారు దీప్ సిద్ధూ.

ఈ నేపథ్యంలో దీప్ సిద్ధూపై ఢిల్లీ పోలీసులు రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. సిద్ధూతో పాటు మ‌రో ముగ్గురిపై కూడా పోలీసులు రివార్డు ప్ర‌క‌టించారు. సిద్దూతో పాటు జెండా ఎగుర‌వేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్‌, గుర్జంత్ సింగ్‌పై రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. ఇక జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్ర‌క‌టించారు.

కిసాన్ ర్యాలీ అల్ల‌ర్లకు సంబంధించి మొత్తం 44 కేసులు న‌మోదు చేయ‌గా, 122 మందిని అరెస్టు చేశారు. ప‌లు రైతు సంఘాల నాయ‌కుల పేర్లు కూడా వివిధ కేసుల్లో న‌మోదు అయ్యాయి. ఇక జ‌ర్న‌లిస్టుల‌పై కూడా పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

- Advertisement -