చ‌దువుకున్న ప్ర‌ధాని కావాలిః కేజ్రీవాల్

255
kejriwal-modi
- Advertisement -

ప్ర‌ధాని మోడీ పై మ‌రోసారి ఫైర‌య్యారు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్. మాజీ ప్ర‌ధాని మన్మోహ‌న్ సింగ్ ను పొగుడుతూ..మోడీ ని తివ్రంగా విమ‌ర్శిస్తూ త‌న ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోదీపై ప‌రోక్షంగానే విమ‌ర్శ‌లు చేశారు. మోడీ చ‌దుకోక‌పోవ‌డం వ‌ల్లే దేశం ఈస్ధితిలో ఉంద‌న్నారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ను ప్ర‌జ‌లు కోల్పోయార‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నిన్న పెట్రోల్, డిజిల్ ఒక‌పైసా త‌గ్గించ‌డం పై ఆయ‌న మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

kejriwal

రూపాయి ప‌తనం దేశీయ పెట్టుబడుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతోంది అనే అంశంపై ఓ మీడియా రాసిన క‌థ‌నం రాయ‌గా..ఈ క‌థ‌నాన్ని కేజ్రీవాల్ నేడు త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేసి ప్ర‌ధానిపై ముక్కుసూటిగా విమ‌ర్శ‌లు చేశారు. అలాగే నిన్న ఢిల్లీలోని ఓ మంత్రి ఇంటిపై సిబిఐ దాడులు చేయించ‌డంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి విద్యావంతులైన పాల‌న‌ను మనం కోల్పోయామ‌ని ట్వీట్ చేశారు. ప్ర‌జ‌లు మ‌ళ్లి మ‌న్మోహ‌న్ లాంటి ప్ర‌ధానిని కోరుకుంటున్నార‌న్నారు.

దేశ ప్ర‌ధాని ఖ‌చ్చితంగా విద్యావంతుడైన వారుండాలన్నారు. లేదంటే దేశ ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌న్నారు. చ‌దువుకున్న వారైతే కొంచెం టెక్నిక‌ల్ గా ఆలోచించుతార‌ని చెప్పారు. పెట్రోల్ , డిజిల్ పై ఒకే సారి 3, 4 రూపాయ‌లు పెంచి త‌గ్గించ‌డంలో మాత్రం ఒక్క‌పైసా త‌గ్గించడం ఎంట‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోడీ డిగ్రీ సర్టిఫీకేట్ న‌కిలీద‌న్నారు. ఇక కేజ్రీవాల్ తాజా ట్వీట్ లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ను పొగ‌డ‌గా.. 2013లో మ‌న్మోహ‌న్ సింగ్ పై కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు కేజ్రీవాల్.

 

- Advertisement -