పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం..

171
Delhi Capitals
- Advertisement -

ఐఫీఎల్ 14 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లతో విజయం సాదించింది. పంజాబ్ కింగ్స్ టార్గెట్‌ను ఛేదించడానికి ఢిల్లీ ఓపెనర్స్ దాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. పంజాబ్ నిర్దేశించిన 196 పరుగుల విజయ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. రాహుల్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేయగా, అగర్వాల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. గేల్ (11) , పూరన్ 9 పరుగులు చేశాడు. దీపక్ హుడా (22), షారూక్ ఖాన్ (15) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరివాలా, రబడ, అవేశ్ ఖాన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 196 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ.. శిఖర్ ధవన్ ధనాధన్ కేవలం 49 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. పృథ్వీషా 32, స్మిత్ 9, రిషభ్ పంత్ 15, స్టోయినిస్ 27, లలిత్ యాదవ్ 12 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జే రిచర్డ్‌సన్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్, మెరిడిత్ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -