మళ్లీ ఓడిన సన్ రైజర్స్‌..

76
david warner
- Advertisement -

ఐపీఎల్‌లో 15వ సీజన్‌లో 5వ ఓటమిని మూటగట్టుకుంది సన్‌రైజర్స్‌. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ విధించిన 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్(62), మార్‌క్రమ్(42) రాణించినా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ…నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వార్నర్‌కి తోడు రోమ్‌వెల్ పావెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 67 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది.

- Advertisement -