ఒకే రోజు నాలుగు సినిమాలు విడుద‌ల‌..

349
Movies
- Advertisement -

డిసెంబ‌ర్ 7న అంటే రేపు ఒక్క‌రోజే ఏడు సినిమాలు విడుద‌ల కానున్నాయి. అటు ఎల‌క్ష‌న్స్ తో పాటు ఒకేసారి నాలుగు సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. అక్కినేని సుమంత్ హీరోగా ఈషా రెబ్బలు హీరోయిన్ గా న‌టించిన సుబ్ర‌హ్మాణ్య‌పురం సినిమా రేపు విడుద‌ల కానుది. కొత్త ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌మూడి ఈసినిమాను తెర‌కెక్కించారు. యాక్ష‌న్ త్రిల్ల‌ర్ గా ఈమూవీ తెర‌కెక్కింది. ఈమూవీలో స‌మంత్ దేవాల‌యాల మీద రీసెర్చ్ చేసే పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా క‌వచం మూవీ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈమూవీతో కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

suamnth

న‌వీన్ చౌద‌రి నిర్మించిన ఈసినిమాలో కాజ‌ల్ , మెహ‌రీన్ లు హ‌రోయిన్లుగా న‌టించారు. ఈచిత్రంలో మొద‌టిసారిగా సాయి శ్రీనివాస్ పోలీస్ పాత్ర‌లో న‌టించాడు. ఇక మ‌రో సినిమా నెక్ట్స్ ఏంటీ. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కునాల్ కోహ్లీ నేరుగా ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు . ఈమూవీలో సందీప్ కిష‌న్ , మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఇక మ‌రో సినిమా శుభ‌లేఖ‌+లు.. ఈ చిత్రంలో శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దీక్షాశర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శరత్ నర్వాడే దర్శకత్వం వహించగా, కేఎం రాధాకృష్ణ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌పై ఈచిత్రాన్ని తెర‌కెక్కించారు.

- Advertisement -