మొక్కలు నాటిన ఎల్‌బి నగర్ డి‌సి‌పి సన్ ప్రీత్ సింగ్..

674
DCP Sunpreet Singh
- Advertisement -

గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రక్షిత కే. మూర్తి, డి‌సి‌పి మల్కాజ్గిరి నుండి స్వికరిస్తూ ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో ఐదు మొక్కలు నాటారు డి‌సి‌పి సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్‌. అనంతరం ఎల్‌బి నగర్ డి‌సి‌పి శంషాబాద్ డి‌సి‌పి ఎన్. ప్రకాష్ రెడ్డికి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ ఐపీఎస్‌కి మరియు బద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్ దత్త్ ఐపీఎస్‌ లను గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

ఈ సందర్భంగా డి‌సి‌పి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హారతహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది అని ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని డి‌సి‌పి అన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని అని అన్నారు.జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే ముందుగా ఉన్నది అంటే కేసీఆర్ గారు చేపట్టిన హరిత హారం యొక్క ప్రతిఫలం, అయన దూర దృష్టికి నిదర్శనం అన్నారు. మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని డి‌సి‌పి పేర్కొన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాచకొండ కమీషనేరేట్ మరియు ఎల్‌బి నగర్ జోన్ పరిదిలోని అన్ని కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని డి‌సి‌పి తెలిపారు.

- Advertisement -