సీఎం నమ్మకాన్ని నిలబెడుతా:దాసోజు

42
- Advertisement -

తన పై నమ్మకాన్ని ఉంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గా అవకాశం కల్పించిన నాకు దైవ సమానులు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు దాసోజు శ్రావణ్. బి.ఆర్.ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మూడవ సారి మళ్ళీ కేసీఆర్ నే ముఖ్యమంత్రి గా గెలిపించుకుంటాం అన్నారు.

తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని…ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యను గుర్తించి ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడం హర్శించదగ్గ నిర్ణయం అన్నారు.

Also Read:మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎరుకుల కులానికి చెందిన కుర్రా సత్యనారాయణను ఎంపికేశారు. ఈయనది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు. సంగారెడ్డి నుండి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. కార్మిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read:రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు..

- Advertisement -