దాశరథి అవార్డు 2022కు : ప్రముఖ కవి డాక్టర్‌ వేణు సంకోజు

143
dasharathi
- Advertisement -

దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు-2022ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ముఖ క‌వి డాక్ట‌ర్ వేణు సంకోజుకు ప్ర‌క‌టించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి దాశ‌ర‌థి కృష్ణమాచార్య‌కు గుర్తుగా ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌తి ఏడాది ఈ అవార్డును తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలకు రాష్ట్ర స‌ర్కారు ప్రక‌టిస్తోంది.

ఈ ఏడాది దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డుకు డాక్ట‌ర్ వేణు సంకోజు పేరును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర స‌ర్కారు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ అవార్డు కింద 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూట పదహార్లు ) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ఈ నెల 22వ తేదీన సత్కార కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -