దాసరి అంత్యక్రియలు పూర్తి..

231
- Advertisement -

దర్శకరత్న, సినీ ఆత్మబంధువు దాసరి నారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మండలం తోల్ కట్టలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో… ఆయన సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు తండ్రి చితికి నిప్పుపెట్టారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ దగ్గరుండి అంత్యక్రియలను జరిపించారు.

Dasari Narayana Rao Funeral complete
ప్రజల సందర్శనార్థం దాసరి భౌతికకాయాన్ని ఇంటి నుంచి ఫిలింఛాంబర్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి మొయినాబాద్‌లోని దాసరి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. దాసరిని కడసారి చూసేందుకు చలనచిత్ర ప్రముఖులు, సినీ కార్మికులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతిమయాత్రలో పాల్గొన్న వారు దాసరితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -